ముందుచూపు లేకపోతే నష్టమే

AP: రాష్ట్రంలో వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోయాయని, శ్రీశైలం, నాగార్జునసాగర్లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని CM చంద్రబాబు అన్నారు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఆయన జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని ముందుచూపు లేకుండా పంటలు వేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. రైతులు ఈ ఏడాది ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.



