3 వేల మంది విద్యార్థులతో చెకుముకి సైన్స్ పరీక్ష!

3000 మంది విద్యార్థులు.. ఒకేరోజు సైన్స్ టాలెంట్ టెస్ట్ రాశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ దొరవారిసత్రం మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రామ్మూర్తి, రాజేష్ బాబు, మస్తాన్ ఈ వివరాలు తెలిపారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన వారు సెప్టెంబర్ 11న జరిగే మండల స్థాయి పరీక్షలో పాల్గొనబోతున్నారు.



