అర్హులందరూ ఓటర్ లిస్టులో ఉండాలి

TG: జగిత్యాల జిల్లా చిన్న మెట్పల్లిలో నిర్వహించిన గ్రామసభకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాలో నమోదైన వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

