కాల్వలోకి దూసుకెళ్లిన RTC బస్సు

AP: పల్నాడు జిల్లాలో RTC బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. విజయవాడ నుంచి వినుకొండకు వెళ్తున్న బస్సు ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురైనా, అదృష్టవశాత్తూ బస్సు బోల్తా పడకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, RTC అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో వినుకొండకు తరలించారు.



