కల్వకుర్తిలో 2K రన్ను విజయవంతం చేయాలి

TG: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 30న 2K రన్ నిర్వహించనున్నారు. “RUN – SAY NO TO DRUGS” నినాదంతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ఎక్స్ రోడ్ నుంచి రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని కోరారు.

