← Back to news

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు

By DK· 11 Jul 2026
ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన ఓ బాలిక.. రాజ్ కుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ మే 16న తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజ్‌‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. తనపై ఫోక్సో కేసు పెట్టిన కుటుంబంపై అతడు కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై వచ్చిన రాజ్ కుమార్ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక కుటుంబంలోని ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. బాలికను హత్య చేసే ముందు పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తన భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడిని కూడా హత్య చేశాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.