రేవంత్ రెండు ఓట్లపై చర్యలు?

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు చోట్ల ఓటరుగా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ 'SIR' సమన్వయ కమిటీ గురువారం ఫిర్యాదు చేసింది. BRS నాయకురాలు మమత, కమిటీ సభ్యులు కలసి ఆయనకు వినతిపత్రం అందచేశారు. ఎపిక్ నంబర్ టీఈఎస్0274035తో కొడంగల్, కొండారెడ్డిపల్లి/అచ్చంపేట ఓటరు నమోదుపై టైమ్ స్టాంపుతో కూడిన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.



