UPSC సాధించలేక నకిలీ అవతారాలెత్తిన ఘనుడు !

ఉత్తరాఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ రామస్వామి కుమారుడు యశ్వర్ధన్ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఐపీఎస్ ఆఫీసర్, రా (RAW) ఏజెంట్ , ఆర్మీ సోల్జర్గా నకిలీ అవతారాలెత్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుండి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు. నిందితుడి వద్ద నుండి 5 ఫేక్ ఐడీ కార్డులు, ఆర్మీ యూనిఫారాలు, వైర్లెస్ సెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీఎస్సీ (UPSC) క్లియర్ చేయలేక, అధికారం కోసం అతను ఈ మోసాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.



