రీసర్వేలో అవకతవకలు జరిగాయని రైతులు నిరసన

AP: ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వేలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామ రైతులు ఆందోళన చేశారు. మంగళవారం రాత్రి ఈపూరు రహదారిపై బైక్లను అడ్డంగా నిలిపి బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో మొత్తం 885 మంది రైతులకు రావాల్సిన అన్నదాత సుఖీభవ నిధులు నిలిచిపోయాయని, కేవలం 65మందికే నగదు జమ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే సమయంలో పొలాల కొలతల్లో జరిగిన తప్పుల కారణంగానే తమ పేర్లు నమోదు కాక అన్నదాత సుఖీభవను కోల్పోయామని రైతులు ఆరోపించారు.



