కేసులు తీయకపోతే మళ్లీ నిరసనలు- కేంద్రానికి సీజేపీ డిమాండ్

విద్యార్థి ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనే ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని కాకరోచ్ జనతా పార్టీ (CJP) మండిపడింది.<br>కేంద్ర విద్యారంగ వివాదాలపై 37 రోజుల పాటు సాగిన దీక్షను విరమించినా, విద్యార్థులపై అరెస్టులు, వేధింపులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను వెంటనే ఎత్తివేయకపోతే రేపటి నుంచే మళ్లీ దేశవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించింది.



