← Back to news

పల్నాడును ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం

By DK· 18 Jul 2026· పల్నాడు జిల్లా
పల్నాడును ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం

AP: పల్నాడులో ఇకపై రక్తపాతం కాదు, పారిశ్రామిక విప్లవం జరగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను వారు పంపిణీ చేశారు. బహిరంగ సభలో CM మాట్లాడుతూ... రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు బ్యాంకు లోన్ పొందడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి లోన్స్ అందించడం, ఇటువంటి రుణ మేళాలు నిర్వహించడం గర్వకారణమన్నారు.

More in AP