← Back to news

నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

By DeeK· 15 Jun 2026· Eenadu· పల్నాడు జిల్లా
నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతిచెందారు. కుంకలగుంట గ్రామం నుంచి 10 మంది కలిసి కోనూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి గ్రామానికి వెళ్తుండగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడడంతో వారంతా నీటమునిగారు. వీరిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. మిగిలిన నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు చిన్నారులు గంధం సంధ్య (9), బత్తుల కార్తీక్‌ (12), గంధం సైనీ (10)తోపాటు కొనత చైతన్య(28) చనిపోయారు.

నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.