నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతిచెందారు. కుంకలగుంట గ్రామం నుంచి 10 మంది కలిసి కోనూరులో ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి గ్రామానికి వెళ్తుండగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడడంతో వారంతా నీటమునిగారు. వీరిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. మిగిలిన నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు చిన్నారులు గంధం సంధ్య (9), బత్తుల కార్తీక్ (12), గంధం సైనీ (10)తోపాటు కొనత చైతన్య(28) చనిపోయారు.




