ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. ఆత్రం మాంతయ్య, భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున రేకుల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



