బహదూర్గూడలో హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. భూములను అప్పగించేందుకు రైతులు నిరాకరిస్తూ గత ఆరు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. స్పష్టమైన పరిహారం, పునరావాస హామీలు ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేశారు. హైడ్రా బృందాలు భూసేకరణ ప్రాంతానికి చేరుకోగా, భారీగా పోలీసులు, అధికారులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.



