← Back to news

ఆలయ సిబ్బందిని అయోధ్య వీడి వెళ్లొద్దని సిట్ ఆదేశాలు

By DS· 21 Jun 2026· UP
ఆలయ సిబ్బందిని  అయోధ్య వీడి వెళ్లొద్దని సిట్ ఆదేశాలు

అయోధ్య రామాలయంలో రూ.200 కోట్ల భక్తుల విరాళాల మాయం కేసులో ఆలయ సిబ్బంది అయోధ్యను వీడి వెళ్లరాదని సిట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.ట్రస్ట్ అధికారులు, ఇతర సిబ్బందిని విచారించిన నివేదికను డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నందున ఎవరూ నగరం దాటి వెళ్లొద్దంది. రోజు వారీ నివేదికను సీఎం కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఆలయంలో నిఘా వ్యవస్థను,భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆలయ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలాలలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.