← Back to news

తప్పుడు లెక్కలు సృష్టించి.. 3.61 కోట్లు స్వాహా

By DK· 12 Jun 2026· Sakshi· అనంతపురం జిల్లా
తప్పుడు లెక్కలు సృష్టించి.. 3.61 కోట్లు స్వాహా

AP: అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయి. జిల్లాలోని 31 మండలాల పరిధిలో చేయని పనులకు బిల్లులు చెల్లించడం, తప్పుడు పేర్లు నమోదు చేయడం, పనికి రాకున్నా మరొకరి పేర్లతో కూలి వేతనాలు చెల్లించడం, వంటి అనేక రూపాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో రూ. 3.61 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు అక్రమాలకు పాల్పడిన వారిలో ఉన్నారు. రికవరీ కోసం విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.