ప్రజలు సుభిక్షంగా ఉండాలి: రేవంత్రెడ్డి

తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని CM రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్వహించిన మహా వరుణయాగంలో CM సతీసమేతంగా పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరియాలని యాగంలో ప్రార్థనలు చేశారు. అనంతరం నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించి నీటి నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.



