నల్గొండ హత్య కేసులో ట్విస్ట్.. కూతురే సుపారీ ఇచ్చి చంపించింది

TG: నల్గొండలోని తెలంగాణ కాలనీలో భార్యాభర్తలు సుల్తాన్(45), హసీనా(40), కొడుకు ముజామిల్ (21), కూతురు అక్సర (11) లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యా? హత్యా? అనేక అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురి హత్య కేసులో సుపారీ హత్య చేయించింది కూతురేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన ఇల్లు మృతురాలు హసీనాకు చెందినది. సుల్తాన్తో పెళ్లి కాకముందే హసీనా ఈ ఇంటిని నిర్మించుకుంది. ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతో హసీనా మొదటి భర్త కూతురు బుషా బుటానీ సుఫారీ హత్య చేయించినట్లు గుర్తించారు.



