← Back to news

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం

By DK· 23 Jul 2026
సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం

AP: రాయలసీమలో సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులను ప్రైవేట్ కంపెనీలు మోసం చేస్తున్నాయని CPM రాష్ట్ర కార్యదర్శి V. శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీల అగ్రిమెంట్లలో అనేక లొసుగులు ఉన్నాయని, ప్రభుత్వం రైతులకు ఎలాంటి కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడం లేదన్నారు. రైతుల భూములను తాకట్టు పెట్టి కంపెనీలు వందల కోట్ల రుణాలు ఎలా పొందుతున్నాయని ప్రశ్నించారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వని వ్యవస్థ, పారిశ్రామికవేత్తలకు మాత్రం అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం థర్డ్ పార్టీగా జోక్యం చేసుకుని రైతులకు భద్రత కల్పించి, న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More in AP