పోలీసులపై దాడి.. పైనుంచి దూకేందుకు డ్రామా

TG: వాట్సాప్ గ్రూపుల ద్వారా హైదరాబాద్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకోగా 50గ్రాముల గంజాయి లభించింది. విచారణలో బాలానగర్ రాజీవ్కాలనీలో ఉంటున్న కిరణ్, దుర్గాప్రసాద్, కమలాకర్ ఈ దందా వెనుక ఉన్నట్లు గుర్తించారు. నార్కోటిక్స్ బృందాలు దాడిచేసి ముగ్గురిని అరెస్ట్ చేశాయి. కిరణ్ ఓ ఇన్స్పెక్టర్పై స్క్రూడ్రైవర్తో దాడికి యత్నించి అనంతరం నాల్గో అంతస్తు నుంచి దూకేందుకు డ్రామా చేసినట్లు పోలీసులు తెలిపారు.



