బోడుప్పల్లో చైన్ స్నాచింగ్

TG: హైదరాబాద్ బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు నర్ర అరుణ మార్నింగ్ వాక్కు వెళ్లింది. నార్త్ బాలాజీ హిల్స్ కాలనీలోని సాకుబు నిలయం సమీపంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. వృద్ధురాలి మెడకు స్వల్ప గాయమైంది. చోరీకి గురైన బంగారు మంగళసూత్రం సుమారు 4.5 తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



