← Back to news

గచ్చిబౌలి చోరీ కేసులో నిందితులు అరెస్ట్

By DK· 9 Jun 2026· Dishadaily· హైదరాబాద్‌
గచ్చిబౌలి చోరీ కేసులో నిందితులు అరెస్ట్

TG: గచ్చిబౌలి పరిధిలో ఉన్న హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటోన్న ఓ వ్యాపారి ఇంట్లో బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. యూపీ పోలీసుల సహకారంతో తీవ్రంగా గాలించి నిందితులను పట్టుకున్నారు. కిలో బంగారు నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతులను అరెస్ట్ చేశారు. వీరిని వ్యాపారి నెలరోజుల క్రితమే పనిలో పెట్టుకోగా.. ఇటీవలే వ్యాపారి కుటుంబం ఓ పనినిమిత్తం ముంబాయికి వెళ్లింది. వారు తిరిగివచ్చే సరికి ఇంట్లోని నగలు, వజ్రాలు కనిపించకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.