కొత్త ఫోన్ కొనివ్వలేదని బావిలోకి దూకిన యువతి!

మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామంలో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. బిందు (22) అనే యువతి తన దగ్గరున్న మొబైల్ సరిగ్గా పని చేయడం లేదని, కొత్త ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడిగింది. అయితే, ప్రస్తుతానికి డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ బాధతో మనోవేదనకు గురైన బిందు, బావిలోకి దూకి సూసైడ్ చేసుకుంది. కొత్త ఫోన్ కోసం యువతి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.



