లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!

మహబూబ్నగర్ జైలు నుండి POCSO కేస్ రిమాండ్ ఖైదీ కిషోర్ కుమార్ (22) పరారయ్యాడు. వనపర్తి సఖి కేంద్రంలో ఉన్న తన లవర్ని కలవడానికి.. సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పి, 4 టవల్స్ సాయంతో జైలు గోడ దూకి ఎస్కేప్ అయ్యాడు. అమరచింత మండలానికి చెందిన ఈ ఖైదీ 25 రోజుల క్రితమే అరెస్టయ్యాడు. ఈ ఘటనపై DIG చౌహాన్ జైలు సూపరింటెండెంట్ శశికాంత్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వన్టౌన్ పోలీసులు ఖైదీ కోసం వెతుకుతున్నారు.



