కూతురు కోసం తండ్రి కన్నీటి పోరాటం

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సై 27 రోజులైనా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏజెన్సీ ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. CCTV ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, స్థానికులను విచారిస్తూ పాప ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ బిడ్డ కోసం తండ్రి గణేష్ పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. గణేష్ స్వయంగా లంబసింగి, చింతపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో జ్ఞానేశ్వర్ ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను అతికించారు. పాప కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.



