పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ

TG: మల్కాజిగిరి PS పరిధి మౌలాలి RTC కాలనీకి చెందిన మారుతి సుతార్ రైల్వేఉద్యోగి. అతని పెన్షన్ బెనిఫిట్స్పై కన్నేసిన భార్య గంగాభాయి, కొడుకు కిషన్ సుతార్, కూతురు ప్రాపుల్లా మర్డర్కు ప్లాన్ చేశారు. మారుతి సుతార్కు విషాన్ని అన్నంలో కలిపి పెట్టడంతో మరణించాడు. ఆ తర్వాత డెడ్బాడీని మాయం చేసేందుకు ముక్కలు ముక్కలుగా చేసి బకెట్లో వేస్తుండగా తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో కోర్టు కిషన్ సుతార్(47), ప్రాపుల్లా(36)లకు ఉరిశిక్ష, గంగాభాయి(65)కు జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.



