← Back to news

పెట్టుబడిదారులకు CM కీలక హామీ

By DK· 1 Aug 2026· హైదరాబాద్
పెట్టుబడిదారులకు CM కీలక హామీ

తెలంగాణ పెట్టుబడులకు అత్యంత సురక్షిత గమ్యస్థానమని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం కొనసాగుతోందన్నారు. మంచి పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చే సంస్థలకు పూర్తి ప్రోత్సాహం, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

More in TG