← Back to news

రైల్‌లో బ్లేడ్ గ్యాంగ్ బీభత్సం.. అరెస్ట్

By డీకే· 4 Jul 2026· విశాఖపట్నం జిల్లా
రైల్‌లో బ్లేడ్ గ్యాంగ్ బీభత్సం.. అరెస్ట్

AP: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ప్రయాణికులను బ్లేడ్‌తో భయపెట్టి, వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీన బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అన్నవరం స్టేషన్ వద్ద నలుగురు యువకులు జనరల్ కోచ్‌లోకి ఎక్కారు. గంజాయి మత్తులో రైలులోని ప్రయాణికులపై బ్లేడ్‌తో బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను దోచుకున్నారు. అనంతరం రైలు స్లో కాగానే నిందితులు దూకి పారిపోయారు. ఆరుగురు బాధితులు విశాఖపట్నం రైల్వేపోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.