ఆటో డ్రైవర్ల రణభేరి.. బిగ్ డిమాండ్స్

TG: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు జనగాం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఈ-ఆటోల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. నిరసనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.



