నేషనల్ హైవేపై కారు బోల్తా

AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట సమీపంలోని నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పగలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మర్రిపాడు నుంచి ఆత్మకూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.



