కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్య

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్నటి నుంచి కృష్ణంరాజు కనపడకుండా పోవడంతో కుటుంబసభ్యులు స్థానిక చెరువు వద్ద వెతకగా డెడ్బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్బాడీని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేసి, మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసి పరారయ్యారైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.



