← Back to news

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

By DK· 19 Jul 2026· రంగారెడ్డి జిల్లా
మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నీలాద్రి హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మంజుల(23) మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ ఇచ్చారని, దానికి రియాక్షన్ రావడంతో మరో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in TG