పేదల సొంతింటి కల.. నెరవేర్చే బాధ్యత మాదే: CM

TG: పదేళ్ల BRS పాలన.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని CM రేవంత్రెడ్డి కోరారు. హైదరాబాద్ KPHB కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలకు అదనంగా తమ ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.



