భార్యే విలనా? హై-సెక్యూరిటీ ఇంట్లో డాక్టర్ హత్య!

కర్ణాటక ధార్వాడ్లోని ఓ హై-సెక్యూరిటీ అపార్ట్మెంట్లో డాక్టర్ కిరణ్ (45) కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఆయన 8 ఏళ్ల కొడుకుపై కూడా కత్తితో దాడి జరగడంతో హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఇన్సిడెంట్ టైంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ రాలేదని, కేవలం భార్య ప్రియాంక మాత్రమే ఉందని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. బంధువుల ఫోన్లకు ఆమె పొంతన లేని ఆన్సర్స్ ఇవ్వడంతో ఈ కేసులో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నయి. ఫ్యామిలీ గొడవలే రీజన్ అని డౌట్ పడుతున్న పోలీసులు.. భార్యనే హత్య చేసి ఉంటుందనే కోణంలో విచారిస్తున్నారు.



