అత్యాచారం కేసులో రిటైర్డ్ ఉద్యోగికి 21ఏళ్ల జైలుశిక్ష

TG: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన వూసా వెంకటనారాయణ(84) రిటైర్డ్ ఉద్యోగి. హైదరాబాద్లోని చైతన్యపురి PS పరిధిలో స్థిరపడ్డాడు. ఆయన 2023లో మతిస్థిమితం సరిగాలేని ఓ బాలికకు బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు వెంకటనారాయణకు 21ఏళ్ల జైలుశిక్ష, రూ.30వేల జరిమానా విధించింది.



