కారుపైకి ఫ్లయ్ యాష్ ట్యాంకర్ బోల్తా !! ఒకరి మృతి
కంచికచర్ల, కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెడుతున్న ఫ్లయ్ యాష్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయి టోల్ గేట్ దగ్గర పక్కనున్న కారుపై బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు మృతి చెందారు. 16 చక్రాల అతిపెద్ద ట్యాంకర్ మీద పడటంతో కారు నుజ్జు నుజ్జు అయిపోయింది.కారు మీద పడిన ట్యాంకర్ ను తొలగించడానికే జేసీబీలను, భారీ క్రేన్లను వాడాల్సి వచ్చింది. చాలా సమయం పట్టింది.



