నవీపేట్ మండలంలో దొంగల బీభత్సం

TG: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని కోస్లీలో వ్యవసాయ బోరు బావుల వద్ద కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేశారు. రాత్రి వేళలో దొంగలు కోస్లీ గ్రామ శివారులోని సుమారు 20వ్యవసాయ బోరు బావుల వద్ద ప్యానెల్ బాక్స్లను ధ్వంసం చేసి కేబుల్ వైర్లను దొంగిలించారు. కోస్లీ గ్రామంతోపాటు ఫకిరాబాద్ తదితర ప్రాంతాల్లో పేకాట రాయుళ్ల ఆగడాలు అధికమవ్వడంతో చోరీలు జరుగుతునయని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.



