నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: చంద్రబాబు

AP: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ ఘటనలో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చేస్తామని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు ఆఫీస్లో సాయికృష్ణ తల్లి, కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. సాయికృష్ణ మిస్సింగ్ ఘటన, తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.



