పెద్దపులి సంచారం.. గ్రామంలో భయం భయం

AP: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని చెరువు సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించి దాడి చేసినది పెద్దపులేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పులి ఇంకా పరిసర ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి లేదా చెరువు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.



