విజయవాడలో విద్యార్థుల భారీ ఆందోళన
AP: విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల 'చలో రాజ్భవన్' పిలుపుతో ఉద్రిక్తత నెలకొంది. సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నేతలు పట్టుబట్టారు. గవర్నర్ను కలిపిస్తామని చెప్పి పోలీసులు మోసం చేశారని నిరసనకారులు మండిపడ్డారు. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంతో కొందరికి గాయాలయ్యాయి. సివిల్ డ్రెస్లో ఉన్న కొంతమంది పోలీసులు తమను ఈడ్చిపారేశారని విద్యార్థులు అన్నారు.



