← Back to news

తెలుగు స్టేట్స్ నుంచి బెంగళూరుకు కొత్త డైలీ ట్రైన్‌!

By Mahesh· 28 Aug 2026
తెలుగు స్టేట్స్ నుంచి బెంగళూరుకు కొత్త డైలీ ట్రైన్‌!

వరంగల్‌, విజయవాడ ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. దానాపూర్‌–బెంగళూర్‌ స్పెషల్‌ ట్రైన్లను ఇకపై డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లుగా నడపనున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి వరంగల్‌, విజయవాడ నుంచి దానాపూర్‌, బెంగళూరుకు డైలీ ట్రైన్‌ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. దానాపూర్‌–బెంగళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22365) వరంగల్‌కు రాత్రి 7.00, విజయవాడ 11.35 గం. చేరుతుంది. బెంగళూర్‌–దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22366) విజయవాడకు సా. 2.55, వరంగల్‌కు 6.18 గం. చేరుతుంది. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు ఈ మార్పు చేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 5h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.