రేపు కర్నూలులో అక్షరం లీటరరీ పురస్కార కార్యక్రమం

AP: రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలోని సర్వేపల్లి స్కూలులో అక్షరం లీటరరీ పురస్కారం-2026 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సభ నిర్వహణ జి.వెంకటకృష్ణ, అధ్యక్షత బాధ్యతలు కెంగార మోహన్ నిర్వహిస్తారు. పురస్కారాన్ని కవి, కథకుడు అనిల్ డ్యానీ అందుకుంటారు. కార్యక్రమంలో రచయితలు పలమనేరు బాలాజీ, శ్రీరామ్ పుప్పాల పాల్గొంటారు. రచయిత దివంగత కాశీభట్ల వేణుగోపాల్ కథల్లో మనోవైజ్ఞానిక అంశాల గురించి మారుతి పౌరోహితం మాట్లాడతారు.



