← Back to news

తెలంగాణలో సైలెంట్‌గా కరోనా వ్యాప్తి

By DK· 22 Jul 2026· హైదరాబాద్
తెలంగాణలో సైలెంట్‌గా కరోనా వ్యాప్తి

TG: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. APలో ఇప్పటికే కొవిడ్ కారణంగా నలుగురు మృతి చెందగా, హైదరాబాద్‌లో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్స్ తెలిపారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు జరగకపోవడంతో కేసులు నిర్ధారణ కావడం లేదని సమాచారం. తార్నాకకు చెందిన ఓ మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిని మృతి చెందిన ఘటనలో కూడా కొవిడ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెస్టు కిట్ల కొరత, ముందస్తు జాగ్రత్తల లోపంపై ప్రజారోగ్య విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More in Health