← Back to news

ప్రోటోకాల్ పాటించలేదని MLA వాకౌట్

By dk· 4 Aug 2026· ఎన్టీఆర్ జిల్లా
ప్రోటోకాల్ పాటించలేదని MLA వాకౌట్

AP: NTR జిల్లా ఎ.కొండూరు మండలం అట్లప్రగడలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కార్యక్రమానికి హాజరైన MLA కొలికపూడి శ్రీనివాసరావు, MROతో పాటు సంబంధిత అధికారులు గైర్హాజరైన విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ మాత్రమే హాజరుకావడంతో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు. అనంతరం సంబంధిత అధికారులు తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ MLA అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More in AP