నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్తో టోకరా

TG: హైదరాబాద్లోని నాగోల్ బండ్లగూడకు చెందిన వెంకట్ రెడ్డి విదేశీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల బారినపడి రూ.4.64 లక్షలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం Naukri.comలో రెజ్యూమ్ అప్లోడ్ చేయగా, దినేష్ మిట్టల్ అనే వ్యక్తి తనను నైకరీ గల్ఫ్ సర్వీస్ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ఖతర్ యూనివర్సిటీలో అధ్యాపకుని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రిక్రూట్మెంట్ ప్రక్రియ పేరుతో పలుదఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నకిలీ నియామక ఉత్తర్వులు, ఖతర్ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఈమెయిల్ పంపించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



