'తల్లి బాధను అర్థం చేసుకోండి'

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయి పదిరోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే చిన్నారి అదృశ్యంపై కొంతమంది పెడుతున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని జ్ఞానేశ్వరి తల్లి భవాని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని ఆశతో ఉన్నామని, ఆ ధైర్యాన్ని కూడా కోల్పోనివ్వద్దని ఆమె కోరారు. మరోవైపు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.



