← Back to news

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

By Vishi· 21 Aug 2026
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం జరిగింది. కొండపై నుంచి జారిపడి తండ్రి, కొడుకు మరణించగా, తల్లి కూడా అదే కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొదట కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు కొండ అంచుకు వెళ్లాడు. కిందికి రావాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంతగానో బతిమాలారు. వినకపోవడంతో రక్షించడానికి తండ్రి కొండపైకి ఎక్కాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ జారిపడి మృతి చెందారు. వాళ్ల మరణాన్ని కళ్లెదుటే చూసిన తల్లి అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు విడిచారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.