మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

TG: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన 'కొమురవెల్లి పుణ్యక్షేత్రం' రైల్వేస్టేషన్ ఈనెల 26న ప్రారంభం కానుంది. దాదాపు రూ.6 కోట్లు ఖర్చు పెట్టి భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో సిద్ధం చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు ఇతర లీడర్లు వచ్చి సికింద్రాబాద్-సిద్దిపేట ట్రైన్ను ప్రారంభించనున్నారు. భక్తులకు డైరెక్ట్గా ట్రైన్ జర్నీ సౌకర్యం దొరుకుతుంది.



