అంబేడ్కర్పై అసత్య ప్రచారం.. అధికారులకు ఫిర్యాదు

AP: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హమారా ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు అధికారులను కోరారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాను రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

