ఓట్లు అడిగే ముందు..బడులను మార్చండి!: అభిజీత్ దీప్కే
విద్య, ఉద్యోగం, భవిష్యత్పై చైతన్యం కలిగించేలా CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే గ్రామా ప్రజలతో మాట్లాడారు. “మా ఓట్లు కావాలంటే ముందుగా ప్రభుత్వ బడులను బాగుచేయాలి” అని వారికి స్పష్టం చేశారు. పిల్లల చదువు విషయంలో పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తో పాటు గ్రామాల్లో కూడా విద్యావకాశాలపై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. చదువు పూర్తయ్యాక యువత వ్యవసాయం, కన్స్ట్రక్షన్ వంటి పనులకే కాకుండా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేలా మార్పు రావాలని పిలుపునిచ్చారు.



